తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయం అయి అతి తక్కువ టైమ్ లోనే మెగా పవర్ స్టార్ గా ఎదిగిన హీరో రాంచరణ్. కృష్ణ వంశి దర్శకత్వంలో ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ చిత్రం షూటింగ్ యూరప్ లలో రెండు షెడ్యుల్ లు పూర్తి చేసుకుంది. తర్వాత ఓల్డ్ సిటీలో కొన్ని ఫైటింగ్ సీన్లు తీశారు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ శంషాబాద్ లో  పరిసర ప్రాంతాల్లో  జరుగుతుంది.  సినిమాలో ముఖ్య నటులతో షూటింగ్ జరుపుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమాలో చరణ్ సరసన రకూల్ ప్రితి సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని విజయదశమి సందర్భంగా విడుదల చేయాలన అనుకుంటున్నారట.
 
Top