తెలుగు ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా‘బాహుబలి’. ఈ సినిమాను రాజమౌళి చాలెంజ్ గా తీసుకొని అహర్షిషలు కష్టపడి పూర్తి చేశారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సినిమా యుద్ద సన్ని వేశాలు పదినిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలు లీక్ కావడం ఎంతో సెన్సెషనల్ క్రియేట్ చేసింది.
దీనపై జనవరిలో చిత్ర నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినిమాలోని యుద్ధ సన్నివేశాలు కొన్ని బయటకు వచ్చాయి. ఇవి గత నెలలో పోలీసులు శోధించి.. గ్రాఫిక్స్‌ వర్క్‌లో పనిచేస్తున్న మూర్తి ద్వారా వచ్చాయని నిర్ధారణ చేశారు. ఇంతా చేసి అతన్ని పట్టుకున్న పోలీసులకు చేదు వార్త అతను అక్కడ పనిచేయడం మానేశారని.
కాని పోలీసులు తమ పని తాము చేసుకువెళ్తుంటారు కదా. అసలు విషయం ఏమిటంటే బయటకు వచ్చిన సీన్స్‌ పోలీసుల వద్ద వున్నాయి. నిర్మాత ఫిర్యాదు మేరకు పోలీసులు రాజమౌళిని పిలిపించి.. అసలు బాహుబలిలోని నిజమైన సీన్స్‌ బయటకు వచ్చాయా? లేక ఇదేమైనా డ్రామానా? అని లేదంటే.. మూర్తి డూప్లికేట్‌గా సీన్స్‌ బయటకు తెచ్చాడా? అనేది పూర్తిగా ఆరాతీయాల్సి ఉంటుంది కాదా..?
ఈ విషయాలు అన్నీ తెలియాంటే మరి జక్కన్న రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అందుకోసం జక్కన్నకు ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇదే విషయం పోలీసులు తెలిపారు. ఆయన వచ్చి క్లారిటీ ఇస్తే సరిపోతుందట.
 
Top