యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ రభస లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టాలీవుడ్ లో వినిపిస్తున్న ఆ సమాచారాన్ని ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. రభస మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సొంతంగా, పూర్తి నిడివి ఉన్న పాటను పాడే అవకాశం ఉందంటున్నారు. ఓ స్పెషల్ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఎన్టీయార్ కోసం డిజైన్ చేశాడు. అందుకోసమే ఆ సాంగ్ ను ఎన్టీఆర్ చేత పాటించాలని డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరూ ఎన్టీఆర్ ను ఒప్పించే పనిలో ఉన్నారు. ఇదే జరిగితే రభస మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మూవీకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. యంగ్ టైగర్ రభస మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి రభస మూవీలో యంగ్ టైగర్ సాంగ్ పాడుతున్నాడు అంటే నందమూరి అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన సమంత మూడోసారి హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్ టైగర్ పాట పాడితే ప్రొఫిషినల్ గా ఉంటుందా? ఉండదా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.
 
Top